దిల్ రాజు నిర్మానసారద్యంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో, అల్లు అర్జున్, పూజా హెగ్డె జంటగా వచ్చిన DJ (దువ్వాడ జగన్నాదం) ఇప్పుడు 5 కోట్ల వ్యూస్ దాటిన మొదటి తెలుగు చిత్రంగా రెకార్డుకెక్కింది. 2017 జున్ 23న విదుదలైన దువ్వాడ జగన్నాదం చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు తన అఫిషియల్ యూట్యూబ్ చానల్లో 2017 డిసెంబర్ 21 నుంచి అందుబాటులో ఉంచడం జరిగింది. అంటే దాదాపు సినిమా విడుదలైన ఆరు నెలల తరువాత ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది.
విడుదలైనప్పుడు యావరేజ్ టాక్ వినిపించిన ఈ చిత్రం ఇలాంటి అరుదైన రికార్డు అందుకోవడంతో ఫాన్స్ సంబరపడుతున్నారు. అయితే ఈ మద్యే ఈ చిత్రానికి సంబందించిన సీటీ మార్ ఫుల్ విడియో సాంగ్ 10 కోట్ల వ్యూస్ దాటడం విశేషం.